వైఎస్సార్‌సీపీ పోరాటంతోనే చంద్రబాబు యూటర్న్‌ | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ పోరాటంతోనే చంద్రబాబు యూటర్న్‌

Published Mon, Apr 2 2018 4:30 AM

YSRCP MP Mekapati  clarification on resignation - Sakshi

నెల్లూరు (సెంట్రల్‌): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం గత నాలుగేళ్లుగా చేస్తున్న పోరాటంతోనే చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా అంశాన్ని అపహాస్యం చేసే విధంగా మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు హోదా కావాలని కొత్త పల్లవి అందుకోవడం చూస్తుంటే రాజకీయ లబ్ధి కోసమేనని స్పష్టంగా తెలుస్తోందన్నారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోరాటంతోనే హోదా అంశం సజీవంగా ఉందన్నారు. చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం హోదాను ఢిల్లీలో తాకట్టు పెట్టి ప్రస్తుతం రోజుకోమాట మాట్లాడటం ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఈ నెల 6వ తేదీలోపు కేంద్రం హోదాపై స్పందించకుంటే తాము రాజీనామాలు చేసి ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఆమరణ దీక్షకు కూర్చుంటామని స్పష్టం చేశారు. చంద్రబాబు ఆడే డ్రామాలన్నీ ప్రజలు గమనిస్తున్నారనే విషయం గుర్తు పెట్టుకుంటే మంచిదని హితువు పలికారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement